దేశ నిర్మాణంలో ఎన్‌సీసీ క్యాడెట్లు ముందుండాలి :కల్నల్ సునీల్ అబ్రహం

దేశ నిర్మాణంలో ఎన్‌సీసీ క్యాడెట్లు ముందుండాలి :కల్నల్ సునీల్ అబ్రహం
  •     గీతం ఎన్​సీసీ యూనిట్​ పరిశీలనలో కమాండర్​ కల్నల్ సునీల్ అబ్రహం

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: నిబద్ధత,  క్రమశిక్షణకు మారుపేరు ఎన్‌సీసీ అని, దేశ నిర్మాణంలో ఎన్‌సీసీ క్యాడెట్లు ముందుండాలని నిజామాబాద్​లోని 33 బెటాలియన్ కమాండర్​ కల్నల్​సునీల్ అబ్రహం అన్నారు.  పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​యూనివర్శిటీ ఎన్​సీసీ యూనిట్​ను శుక్రవారం ఆయన సందర్శించారు.  అనంతరం ఎన్​సీసీ క్యాడెట్లతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఉన్నత ప్రమాణాలు చేరుకోవడానికి శిక్షణ ఎంతో ప్రాముఖ్యమైందని వివరించారు.

ఎన్​సీసీ సామాజిక సేవతోనే ఆగిపోదని సమాజ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగాల్లో ఎన్​సీసీ విద్యార్ధులకు 30 శాతం వెయిటేజీ లభిస్తుందని, మహారాష్ట్ర ప్రభుత్వం పోలీస్​ ఉద్యోగాల్లో 5 శాతం అవకాశం కల్పిస్తోందన్నారు. అనంతరం జాతీయ, అంతర్జాతీయ క్యాంపులకు ఎన్నికైన గీతం ఎన్​సీసీ విద్యార్థులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో సంగారెడ్డి కమాండింగ్​ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్​రమేశ్​సిరియాల్, అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్​కల్నల్​మధుసూధన రావు, గీతం వీసీ ప్రొఫెసర్​డీఎస్​రావు, రెసిడెంట్ డైరెక్టర్​డీవీవీఎస్​ఆర్​ వర్మ, ఎన్​సీసీ ఆఫీసర్ అజయ్​కుమార్ తదితరులు పాల్గొన్నారు.