రామగుండంలో అన్ని ఏరియాల్లో స్ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైట్లు : కమిషనర్ జె.అరుణశ్రీ

రామగుండంలో అన్ని ఏరియాల్లో స్ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైట్లు : కమిషనర్ జె.అరుణశ్రీ

గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్​ పరిధిలోని అన్ని ఏరియాల్లో స్ట్రీట్​లైట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్​ కలెక్టర్, కమిషనర్(ఎఫ్ఏసీ) జె.అరుణశ్రీ తెలిపారు. శుక్రవారం బల్దియా ఆఫీస్​లో అధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేషన్​ నిధులు రూ.33.90  లక్షలతో లైట్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు.

 మొత్తం 1,300 కొత్త స్ట్రీట్​ లైట్లను మరో 30 రోజుల్లోపు అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కార్పొరేషన్​ పరిధిలో కొత్తగా 1,219 కొత్త విద్యుత్ పోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరమని అంచనా వేయగా 677 పోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వేసినట్లు చెప్పారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులు బకాయలతో సహా సకాలంలో పన్నులు చెల్లించి కార్పొరేషన్​కు సహకరించాలని ఈ సందర్భంగా కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరారు. అనంతరం బల్దియా పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. అడిషనల్​ కలెక్టర్​ వెంట కార్పొరేటర్​ కన్నూరి సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆఫీసర్లు రాజు, శివానంద్, రామన్, జమీల్, మీర్, సునీల్ రాథోడ్, తదితరులున్నారు.