గంటలో ఫిర్యాదు చేస్తే సైబర్ మోసాలకు చెక్ : కమిషనర్ సునీల్ దత్

గంటలో ఫిర్యాదు చేస్తే సైబర్ మోసాలకు చెక్ :  కమిషనర్ సునీల్ దత్
  • 3.4  లక్షల డబ్బులు సైబర్ నేరగాళ్ల ఖాతాలకు వెళ్లకుండా నిలిపివేత 
  • 1930 సైబర్ క్రైమ్   పోర్టల్ లో ఫిర్యాదు చేస్తే బాధితులకు మేలు..
  • ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం టౌన్, వెలుగు:  సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గుర్తించిన గంటలో ఫిర్యాదు చేయడం వల్ల బాధితులకు మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.  ఇటీవల కాలంలో రోజుకో  రకం సైబర్ మోసాలు వెలుగు చూస్తున్నాయని, సులభంగా డబ్బు సంపాదించేందుకు కొందరు కేటుగాళ్లు మోసాల బాట పడుతున్నారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకోవటం కన్నా, అప్రమత్తంగా ఉండటం ముఖ్యమని పెర్కొన్నారు.

ఇటీవల నగరానికి చెందిన ఓ యువతి కి చెందిన ఇన్ స్టాగ్రాం, వాట్సాప్, టెలిగ్రామ్ అప్లికేషన్స్ లో వచ్చిన లింక్ ను క్లిక్ చేయడంతో రోజు వారీగా మూడు నుంచి  నాలుగు వేల రూపాయలు ఆదాయం వస్తుందని వచ్చిన మెసేజ్ నమ్మి విడతల వారీగా రూ. 3,43,000 పోగొట్టుకున్నారన్నారు.  అయినప్పటికీ వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో  సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలకు వెళ్లకుండా ఫ్రీజ్  చేశామని చెప్పారు. తెలియని నంబర్ల నుంచి మెసేజ్‌‌‌‌లు, కాల్స్‌‌‌‌ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. మెసేజ్‌‌‌‌లు, స్పామ్ కాల్స్ వస్తే వెంటనే బ్లాక్ చేయాలని సూచించారు.