
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్కు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 142 విద్యాసంస్థలు పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తున్నాయి.
కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంఎఫ్ఎ, ఎంపీఏ, ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ వొకేషన్, ఎంఎడ్, ఎంఎల్ఐఎస్సీ, ఎంపీఈడీ, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంకాం.అర్హత: ఇప్పటికే డిగ్రీ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ కోర్సుల్లో ఉన్న విద్యార్థులు సీయూఈటీ రాసుకోవచ్చు. పలు కోర్సులకు ఏదైనా డిగ్రీ సరిపోతుంది. మిగిలినవాటికి డిగ్రీలో సంబంధిత కోర్సు చదివినవారై ఉండాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్: ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. రెండు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ మీడియంలో (లాంగ్వేజ్, సాహిత్య పేపర్లు తప్ప) ఉంటాయి. ఇందులో పార్ట్-ఎ, పార్ట్-బి అనే రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఎ 25, పార్ట్-బిలో 75 ప్రశ్నలు వస్తాయి. పార్ట్-ఎలో జనరల్, పార్ట్-బిలో సంబంధిత సబ్జెక్టు ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు.
దరఖాస్తులు: ఏప్రిల్ 19 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.cuet.nta.nic.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు.