మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు : సీసీఏ తారాచంద్​

మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు : సీసీఏ తారాచంద్​
  • సీసీఏ తారాచంద్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలకు ఇంటర్నెట్, 4జీ సేవలందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల కంట్రోల్​ అండ్​ కమ్యూనికేషన్​ అకౌంటింగ్​ తారాచంద్​ తెలిపారు. శనివారం భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్​లో కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్నెట్​ 4జీ సెల్​ టవర్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.

ప్రాధాన్యతను బట్టి టవర్ల నిర్మిస్తామని చెప్పారు. ప్రజలకు మెరుగైన ఇంటర్నెట్​ సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వ సాయంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రోగ్రాంలో సీపీవో సంజీవరావు, డీపీవో చంద్రమౌళి, ఎన్​ఐసీడీఐజీ సుశీల్​కుమార్, బీఎస్ఎన్ఎల్​డీజీఎం శ్రీనివాస్, ఏజీఎం సుధీర్, ఎస్డీఈ సక్రూ నాయక్​పాల్గొన్నారు.