
హనుమకొండ, వెలుగు: వ్యక్తులు, వ్యవస్థల మధ్య తలెత్తిన వివాదాలను కమ్యూనిటీ పెద్దలు పరిష్కరించి శాంతియుత సమాజ స్థాపనకు చొరవ తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్సుజోయ్ పాల్సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్లకు శుక్రవారం వరంగల్డీసీసీబీ కాన్ఫరెన్స్హాలులో నిర్వహించే మూడు రోజుల శిక్షణ తరగతులకు ఆయన చీఫ్ గెస్ట్గా హాజరై ప్రారంభించి మాట్లాడారు.
ఏ వివాదమైనా ఇద్దరు వ్యక్తులు, రెండు గ్రూపుల మధ్య ఏర్పడుతుందని, వారంతా ఏదో ఒక సామాజికవర్గానికి చెందినవారై ఉంటారని, అదే కమ్యూనిటీ పెద్దలు నచ్చజెబితే వివాదాలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ఇలాంటి ఆలోచన నుంచే కమ్యూనిటీ మీడియేషన్ పుట్టిందని, తొలిసారిగా కేరళలో సక్సెస్ అయిందని, అక్కడ వేల కేసులను కోర్టు దాకా తీసుకురాకుండా కమ్యూనిటీ పెద్దలే పరిష్కరించారని గుర్తుచేశారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్లోనూ కూడా ఇదే విధానం అమలైందని తెలిపారు. ఇలాంటి విధానానికి 2023లో చట్టబద్ధత వచ్చిందన్నారు.
కొన్నేండ్లుగా భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య తగాదాలు పెరుగుతున్నాయని, వాటన్నింటికీ కమ్యూనిటీ మీడియేషన్చక్కటి పరిష్కార వేదిక అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 7న కామారెడ్డిలో 12 కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్.పంచాక్షరి తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్లో కమ్యూనిటీ మీడియేషన్వలంటీర్లు విజయవంతంగా పని చేస్తున్నారన్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు బీవీ నిర్మల గీతాంబ, సీహెచ్రమేశ్బాబు, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమాదేశ్పాండే తదితరులు పాల్గొన్నారు.