
మెదక్, వెలుగు : మెదక్ జిల్లా డీఎంఅండ్ హెచ్ఓ ఆఫీసులో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఫహీం పాషా రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గురువారం స్థానిక బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్ వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ కథనం ప్రకారం... ఫిజియోథెరపిస్ట్ సతీశ్ నర్సాపూర్లో ఫిజియోథెరఫీ క్లినిక్ ఏర్పాటు చేసేందుకు పర్మిషన్ కోసం నెల రోజుల కింద ఆన్ లైన్లో అప్లై చేశాడు. తర్వాత జిల్లా కేంద్రమైన మెదక్లోని డీఎంహెచ్ఓ ఆఫీస్కు వెళ్లి అవసరమైన సర్టిఫికెట్లు, బ్యాంక్ డీడీ అందజేశారు.
సంబంధిత ఫైల్ప్రాసెస్ చేసేందుకు ఆఫీస్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ఆఫీసర్(సీహెచ్ఓ) ఫహీం పాషా రూ.15 వేలు డిమాండ్ చేశారు. దీంతో సతీశ్ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం ఫహీం పాషా మెదక్లోని డిపో బస్టాండ్ దగ్గర సతీశ్ నుంచి లంచం తీసుకుంటుండగా అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఫహీం పాషాను అదుపులోకి తీసుకుని కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ ఆఫీస్కు తీసుకువెళ్లి ఎంక్వైరీ చేశారు. ఇంకెవరిదైనా పాత్ర ఉందా అనేది విచారణలో తెలుస్తుందని ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపారు. దాడుల్లో వెంకట్రాజాగౌడ్, నవీన్ ఉన్నారు.