
- మండలకేంద్రాల్లో బీజేపీ లీడర్ల వినతులు
నెట్వర్క్, వెలుగు: సాగునీరు లేక పంటలు ఎండిపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బీజేపీ లీడర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉమ్మడి జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో ఆ పార్టీ లీడర్లు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. సిరిసిల్లలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీరుద్రమరెడ్డి అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్కు వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మంగళవారం కరీంనగర్లో చేపట్టనున్న రైతు దీక్షకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. వేములవాడ, కోనరావుపేట, చందుర్తి, హుజూరాబాద్, జమ్మికుంట, కరీంనగర్ రూరల్,శంకరపట్నం మండలకేంద్రాల్లోని తహసీల్ ఆఫీస్ల వద్ద బీజేపీ లీడర్లు నిరసన చేపట్టి తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. -