బిగ్ బాస్ గంగవ్వపై కేసు నమోదు. ఎందుకంటే.?

బిగ్ బాస్ గంగవ్వపై కేసు నమోదు. ఎందుకంటే.?

మైవిలేజ్ షో ద్వారా గుర్తింపు పొందిన గంగవ్వ చిక్కుల్లో పడ్డారు. గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజు పై అటవీశాఖ అధికారులు, వైల్డ్ లైఫ్ కింద జగిత్యాల ఎఫ్.ఆర్. ఓ. పద్మారావు కేసు నమోదు చేశారు.  2022 సంవత్సరం మే నెలలో తీసిన ఓ వీడియోలో చిలుకను ఉపయోగించడంపై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్ఓ పద్మారావు తెలిపారు.

యూట్యూబ్ ‌ప్రయోజనాల కోసం చిలుకను హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదు చెయ్యడంతో జంతు‌ సంరక్షణ ‌కార్యకర్త గౌతమ్ ఈ ఘటనపై ఫిర్యాదు చేసినట్లుగా ఎఫ్ఆర్ఓ తెలిపారు. దీంతో యూట్యూబర్ రాజు 25వేల రూపాయల ఫైన్  కట్టారు.బిగ్ బాస్ గంగవ్వపై కేసు నమోదు.

ALSO READ | Bigg Boss: షాక్.. హౌస్ నుంచి వెళ్లిపోతానన్న మాజీ కంటెస్టెంట్.. డోర్ తెరిచిన బిగ్‍బాస్

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం గంగవ్వ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానెల్ అయిన స్టార్ మాలో ప్రసారం అవుతున్న తెలుగు బిగ్ బాస్ 8 వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంటుంది. గతంలో 4 వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకోగా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.