రఘునందన్ రావు పై ఈసీకి ఫిర్యాదు

రఘునందన్ రావు పై ఈసీకి ఫిర్యాదు

కంది, వెలుగు: బీఆర్​ఎస్​ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత రఘునందన్​రావుపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్​ అధికారులను కోరారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి వికాస్​రాజ్​ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు హరీశ్​రావు, కొత్త ప్రభాకర్​ రెడ్డి, మెదక్​ బీఆర్ఎస్​ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై రఘునందన్​ రావు పరుషపదజాలంతో తిట్టారని తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం ఇచ్చినవారిలో కాసాల బుచ్చిరెడ్డి ఉన్నారు.