శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన

హైదరాబాద్:  శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. ఆకాశ ఎయిర్ లైన్స్ కి చెందిన విమానం ఆలస్యం అయింది. సోమవారం తెల్లవారుజామున 5గంటలకు ఢిల్లీకి బయలుదేరాల్సిన ఫ్లైట్ ఇంకా విమానాశ్రయం నుంచి వెళ్లలేదు. ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు గంటలకుపైగా ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.