వికారాబాద్ జిల్లాలోని స్కూల్లో ఊడిపడ్డ పెచ్చులు.. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్​కు గాయాలు

వికారాబాద్ జిల్లాలోని స్కూల్లో ఊడిపడ్డ పెచ్చులు.. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్​కు గాయాలు

వికారాబాద్, వెలుగు: గవర్నమెంట్ స్కూల్లో పెచ్చులు ఊడిపడి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్​కు గాయాలయ్యాయి. వికారాబాద్ జిల్లా ధారూర్​ మండలంలోని మున్నూర్​సోమారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శీరిష ఫస్ట్​ క్లాస్​చదువుతోంది. బుధవారం ఎప్పటిలాగే స్కూల్​కు వెళ్లగా, ఉదయం తరగతి గదిలో ఆమెపై ఆకస్మాత్తుగా పెచ్చులు ఊడిపడ్డాయి.

ఈ సమయంలో క్లాస్​లో 14 మంది విద్యార్థులు ఉండగా, శిరీష తల, కాలికి గాయాలయ్యాయి. దీంతో బాధిత తల్లిదండ్రులకు స్కూల్ సిబ్బంది సమాచారం ఇవ్వగా, హుటాహుటిన సమీప ప్రైవేటు హాస్పిటల్​కు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్​తీసుకుంటున్న చిన్నారిని డీఈఓ రేణుకాదేవి పరామర్శించారు. అనంతరం మున్నూర్​ సోమారంలోని పాఠశాలను సందర్శించారు.