- రెండేండ్లుగా మెయింటనెన్స్ పైసలు వస్తలేవు
- కరెంట్ బిల్లు చెల్లిస్తలే
యాదాద్రి, వెలుగు : మెయింటనెన్స్ పైసలు రాకపోవడంతో రైతు వేదికల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. చివరకు కరెంట్బిల్లు కట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో ట్రాన్స్కో స్టాఫ్ నుంచి అగ్రికల్చర్స్టాఫ్కు హెచ్చరికలు వస్తున్నాయి. అడ్డగూడూరులోని రైతు వేదిక కరెంట్తొలగించడంతో మంగళవారం నిర్వహించే 'రైతు నేస్తం' వీసీ ప్రోగ్రాం ఆగిపోయింది.
జిల్లాలోని 92 క్లస్టర్లు..
వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు రైతులకు ఆధునిక సాగుపై నిరంతరంగా అవగాహన కల్పించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి రైతు వేదికలను నిర్మించింది. 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లో 92 క్లస్టర్లను గుర్తించి రైతు వేదికలను నిర్మించారు. వీటి నిర్వహణ కోసం ఒక్కో వేదికకు ప్రతినెలా రూ.9 వేల చొప్పున ఇస్తామని అప్పటి సర్కారు ప్రకటించింది. ఈ సొమ్మును కరెంట్ బిల్లు, స్టేషనరీ, మీటింగ్స్ కోసం ఖర్చు చేయాలని సూచించింది. అయితే అవి కూడా రెగ్యులర్గా రిలీజ్ చేయలేదు. 2022 చివరిలో ఒకసారి ఫండ్స్ రిలీజ్ చేసింది.
మెయింటనెన్స్ లేదు..
రైతు వేదికలకు వాచ్మెన్, స్పీపర్ను నియమించుకోవాలని గతంలో ఆర్డర్స్ జారీ చేసింది. అయితే మెయింటెన్స్ నిధులు రాకపోవడంతో వాచ్మెన్, స్వీపర్లను నియమించలేదు. చాలా రైతు వేదికల్లో కనీసం వాటర్ సౌకర్యం కూడా లేదు. రైతు వేదికల నిర్వహణలో స్టేషనరీ, మీటింగ్స్ ఖర్చు సంగతేమో కానీ కరెంట్ బిల్లు సమస్య అగ్రికల్చర్ ఆఫీసర్లపై పడింది. రైతు వేదికలకు సంబంధించి కరెంట్బిల్లు కొన్నింటిలో రెండేండ్ల పాటు పెండింగ్లోనే ఉంది.
కొన్నిచోట్ల ఏఈవోలు తమ జేబు నుంచి ఖర్చు చేసిన సంఘటనలూ ఉన్నాయి. ఒక్కో రైతు వేదిక రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పైగా కరెంట్బిల్లు బకాయిలు ఉన్నాయి. దీంతో ట్రాన్స్కో నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు కరెంట్ కట్ చేస్తామని హెచ్చరికలు వస్తున్నాయి. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులకు అగ్రికల్చర్ స్టాఫ్ పలుమార్లు విన్నవించినా పైనుంచి బిల్లులు రాలేదని చెబుతున్నట్టుగా తెలుస్తోంది.
కరెంట్ కట్.. రైతు నేస్తం బంద్..
ఒక్కో మండలంలోని రైతు వేదికలో ప్రతి మంగళవారం 'రైతు నేస్తం' వీసీ నిర్వహిస్తున్నారు. యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లోని రైతు వేదికల్లో ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. హైదరాబాద్లోని హెడ్డాఫీస్ నుంచి నిర్వహించే ఈ ప్రోగ్రాం కోసం వీసీ నిర్వహించే రైతువేదికకు కరెంట్, ఇంటర్ నెట్ కనెక్షన్తప్పనిసరి. అయితే జిల్లాలోని అడ్డగూడూరులోని రైతు వేదికకు సంబంధించిన కరెంట్బిల్లు రూ.10 వేలకు పైగా బకాయి ఉంది. ఆ రైతు వేదికకు ట్రాన్స్కో స్టాఫ్ కరెంట్ కనెక్షన్తొలగించారు. దీంతో మోత్కూరులోని రైతు వేదికలో జరుగుతున్న రైతు నేస్తం వీసీకి అడ్డగూడూరు మండల అగ్రికల్చర్ఆఫీసర్లు హాజరయ్యారు. ఈ విషయం జిల్లా హయ్యర్ ఆఫీసర్ల దృష్టికి చేరింది. దీంతో ట్రాన్స్కో ఆఫీసర్లతో మాట్లాడుతున్నట్టుగా
తెలుస్తోంది.