
మధిర, వెలుగు : ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందాపురం (ఎల్)గ్రామంలో ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న రామాలయ నిర్మాణ విషయంలో కాంగ్రెస్, సీపీఎం వర్గాల మధ్య ఆదివారం గొడవ జరిగింది. ఆ స్థలంలో ఆలయ నిర్మాణం చేపట్టవద్దని మొదటినుంచీ సీపీఎం డిమాండ్ చేస్తున్నది. ప్రస్తుతం టెంపుల్ నిర్మాణం పూర్తయి ప్రహరీ కడుతున్నారు. దీని కోసం గుంతలు తీశారు. ఈ గుంతలను ఆదివారం సీపీఎంకు చెందినవారు పూడ్చారు. దీన్ని కాంగ్రెస్వర్గీయులు ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. గాయపడిన వారు ఖమ్మం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. బోనకల్పోలీస్స్టేషన్లో ఒకరిపై ఒకరు కంప్లయింట్ చేసుకున్నారు. వైరా ఏసీపీ రెహమాన్, మధిర సీఐ వసంతకుమార్, ఎస్ఐ సాయికుమార్ రెండు పార్టీల వారిని బోనకల్ పీఎస్కు పిలిపించి మాట్లాడారు. వీడియో, సీసీ ఫుటేజీలను పరిశీలించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.