
- దూసుకుపోతున్న కాంగ్రెస్, బీజేపీ
- ఓటర్లను నేరుగా కలుస్తున్న శ్రేణులు
- వాయిస్ మెసేజీలు.. డైరెక్ట్ కాల్స్
నిజామాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతుండడంతో ప్రచారం జోరందుకుంది. బీజేపీ తరపున టీచర్స్ స్థానానికి మల్క కొమురయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి పోటీ చేస్తుండగా ఆ పార్టీ ముఖ్య నేతలు, అనుబంధ సంఘాలు, హిందూ ధార్మిక సంస్థల నేతలు ప్రచారంలో తలమునకలయ్యారు. గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీగా కాంగ్రెస్పార్టీ నుంచి అల్ఫోర్స్నరేందర్రెడ్డి పోటీలో ఉన్నారు. పీసీసీ ఆయన గెలుపును సవాల్గా తీసుకుంది. పార్టీ సీనియర్లకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ నాయకత్వం పార్టీ శ్రేణులన్నింటినీ గ్రౌండ్లోకి దింపింది. ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంది.
రెండు ప్రధాన పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. క్షేత్రస్థాయి కార్యకర్తలు పట్టణాల్లో, గ్రామాల్లో ప్రతిఓటరును నేరుగా కలిసి తమ అభ్యర్థికే మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని కోరుతున్నారు. దీనికి తోడు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వాట్స్అప్, ఫేస్బుక్లలో పోస్టులు కుమ్మేస్తున్నారు. ఓటర్లకు వాయిస్ మెసేజీలు పంపుతున్నారు. ప్రధానపార్టీలతో పాటు కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థుల తరఫున ఓటర్లకు ఫొన్లు చేసి ఓటడుతున్నారు. ఒక్కోరోజు 20, 30 కాల్స్వస్తుండడంతో ఓటర్లు చిరాకు పడుతున్నారు.
జోరుమీదున్న కాంగ్రెస్
నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ఎమ్మెల్సీ స్థానం నిలబెట్టుకోవడాన్ని కాంగ్రెస్ చాలెంజ్గా తీసుకుంది. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో లీడర్లంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లాలో రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ అనుకూలంగా మారాయి.
56 వేల ఉద్యోగాల భర్తీ చేయడం లాంటి అంశాలు కలిసివస్తాయని భావిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు త్వరలో జరిగే లోకల్బాడీ ఎలక్షన్స్పై ప్రభావం చూపనుండడంతో కిందిస్థాయి నుంచి పార్టీ శ్రేణులను ప్రచారంలోకి దింపారు. 20 మంది ఓటర్లకు ఒకరిని ఇంచార్జిగా నియమించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రెండుసార్లు విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి గ్రాడ్యుయేట్స్తో వరుసగా మీటింగ్లు నిర్వహించారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ లీడర్లు చురుగ్గా ప్రచారంలో పాల్గొంటున్నారు.
25 మందికి ఒక ఇన్చార్జ్
నిజామాబాద్ జిల్లాలో ఓటు హక్కు ఉన్న టీచర్స్ 3,751, గ్రాడ్యుయేట్ ఓటర్లు 31,574 మంది ఉన్నారు. ప్రతి 25 మంది ఓటర్లకు బీజేపీ ఒక్కో ఇన్చార్జిని నియమించింది. ఇప్పటికే గ్రామస్థాయి వరకు ఇన్చార్జిలతో మీటింగులు పూర్తి చేశారు. ప్రతి ఓటరును ఇన్చార్జీలు కలిసేలా ప్లాన్చేశారు. ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్ రెడ్డి క్యాడర్కు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థులు మల్క కొమురయ్య, అంజిరెడ్డి జిల్లాలో ఇప్పటికే ఐదుసార్లు ప్రచారంలో పాల్గొన్నారు.