ఒక్క పనిని వేర్వేరుగా ప్రారంభించిన కాంగ్రెస్, బీఆర్ఎస్

ఒక్క పనిని వేర్వేరుగా  ప్రారంభించిన కాంగ్రెస్, బీఆర్ఎస్

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​పరిధిలో కాంగ్రెస్ వర్సెస్​ బీఆర్ఎస్ ఫైట్ కొనసాగుతున్నది. తాజాగా ఒకే పనిని ఆ పార్టీల నేతలు వేర్వేరుగా ప్రారంభోత్సవం చేయడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీతాఫల్​మండి డివిజన్ భవానీనగర్​లో రూ 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పద్మారావుగౌడ్, కార్పొరేటర్​ సామల హేమ కలిసి సోమవారం ప్రారంభించారు.

 కొంతసేపటి తర్వాత అక్కడికి వచ్చిన కాంగ్రెస్​ నాయకులు అదే ప్రాంతంలో కొబ్బరికాయలు కొట్టి రెండోసారి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. సికింద్రాబాద్​ కాంగ్రెస్​ఇన్ చార్జీ ఆదం సంతోష్​కుమార్​ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరు చేయించినట్లు కాంగ్రెస్​ నేత మాదిరెడ్డి జలంధర్​రెడ్డి పేర్కొన్నారు.