
ఎమ్మెల్యేపై పలుపోలీస్స్టేషన్లలోకాంగ్రెస్ శ్రేణల ఫిర్యాదు
దౌల్తాబాద్లో కాన్వాయ్ అడ్డుకుని నిరసన..దిష్టిబొమ్మలు దహనం
సిద్దిపేట/దుబ్బాక/కూకట్పల్లి, వెలుగు:బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో కాంగ్రెస్ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి చేసిన కామెంట్లపై దుమారం చెలరేగింది. పలు పార్టీల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొత్త ప్రభాకర్రెడ్డి స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని వెల్లడించారు. మంగళవారం కొత్త ప్రభాకర్రెడ్డి దౌల్తాబాద్లో జరిగిన బీఆర్ఎస్సమావేశంలో మాట్లాడారు."
కాంగ్రెస్పాలనలో రియల్ఎస్టేట్కుంటుపడిందని, ఆపదొస్తే నాలుగు గుంటలు అమ్ముకుందామన్నా ఎవరూ కొనడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పోతే బాగుండని సామాన్య ప్రజలు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు, రైతులు కోరుకుంటున్నారని నేను అన్నారు. స్వచ్ఛందంగా చందాలేసుకుని బీఆర్ఎస్ను గెలిపించుకుంటామని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు చెబుతున్నారని మాత్రమే అన్నాను. కాంగ్రెస్ప్రభుత్వాన్ని మేం కూల్చబోం. ఇదంతా మీడియా సృష్టే" అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యేకు నిరసన సెగ
రాయపోల్పర్యటనను ముగించుకుని దౌల్తాబాద్ లో బీఆర్ఎస్సమావేశానికి వెళ్తున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డికి నిరసన సెగ తగిలింది. స్థానిక అంబేద్కర్చౌరస్తా వద్ద అయన కాన్వాయ్ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొగుటలో నియోజకవర్గ ఇన్చార్జీ చెరుకు శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో కొత్త ప్రభాకర్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాయపోల్, అక్భర్పేట, భూంపల్లి మండల కేంద్రం, దుబ్బాకలోనూ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కూకట్పల్లి, తోగుట, భూంపల్లి, దుబ్బాకతోపాటు పలు పోలీస్స్టేషన్లలో కొత్త ప్రభాకర్రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణలు ఫిర్యాదు చేశారు.