కంటోన్మెంట్ కాంగ్రెస్ దే

కంటోన్మెంట్ కాంగ్రెస్ దే
  •   13 వేల ఓట్ల మెజార్టీతో శ్రీగణేశ్ గెలుపు

సికింద్రాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేశ్ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ కు చెందిన నివేదితపై 13 వేల ఓట్ల మెజార్టీ సాధించారు. 2023లో జరిగిన సాధరణ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నందిత పోటీ చేసి గెలుపొందారు. ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. 

దీంతో కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కి బై ఎలక్షన్ అనివార్యం అయ్యింది. కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్, బీఆర్ఎస్ నుంచి దివంగత సాయన్న చిన్న కూతురు నివేదిత, బీజేపీ నుంచి వంశతిలక్‌ పోటీ పడ్డారు. శ్రీగణేశ్ గెలుపుతో అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఒక సీటు పెరిగినట్లయింది.