న్యూఢిల్లీ/చండీగఢ్:హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 8 మంది అభ్యర్థులతో గురువారం మరో జాబితాను విడుదల చేసింది. పొత్తులో భాగంగా భివానీ స్థానాన్ని సీపీఐ(ఎం)కు కేటాయిం చడంతో మొత్తం 90 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
తాల్ నుంచి ఎంపీ రణదీప్ సూర్జేవాలా కుమారుడు ఆదిత్య సూర్జేవాలాను కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది. అంబాలా కాంట్ నుంచి పరిమల్ పారి, పానిపట్ రూరల్ నుంచి సచిన్ కుందు, నర్వానా (ఎస్సీ) స్థానం నుంచి సత్బీర్ దుబ్లెయిన్, టిగావ్ నుంచి రోహిత్ నగార్ పోటీ చేస్తున్నారు.
టీవల కాంగ్రెస్లో చేరిన జర్నలిస్ట్ సర్వ మిత్ర కాంబోజ్ సిర్సా జిల్లాలోని రానియా స్థానం నుంచి బరిలోకి దిగారు. కాగా, గురువారం నాటితో రాష్ట్రంలో నామినేషన్ల గడువు ముగిసింది.