కేటీఆర్​వి చిల్లర మాటలు.. కాంగ్రెస్​

కేటీఆర్​వి చిల్లర మాటలు.. కాంగ్రెస్​
  • అధికారం పోయినా అహంకారం తగ్గలేదని కామెంట్​
  • రాజీవ్​ గాంధీని ప్రశంసిస్తూ కేసీఆర్​ మాట్లాడిన వీడియో రిలీజ్​చేసి కేటీఆర్​కు స్ట్రాంగ్​ కౌంటర్​

హైదరాబాద్, వెలుగు:  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ ఎదుట ఏర్పాటు చేయడాన్ని తప్పుపడుతూ బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​​అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్​ మండిపడింది. రాజీవ్​గాంధీపై కేటీఆర్​వి చిల్లర మాటలని, ఆయన అహంకారానికి నిదర్శనమని ఫైర్​ అయ్యింది.

గతంలో రాజీవ్ గాంధీని ప్రశంసిస్తూ కేసీఆర్​ మాట్లాడిన ఓ వీడియోను కేటీఆర్​కు కౌంటర్​అటాక్​గా మీడియాకు సోమవారం రిలీజ్  చేసింది. హైదరాబాద్ లో సైబర్ టవర్ ఏర్పాటు, ఐటీ సంస్థల విస్తరణకు అప్పటి ప్రధాని, సీఎంలైన  రాజీవ్ గాంధీ, ఎన్. జనార్దన్​రెడ్డి  కారణమని, నగర అభివృద్ధిలో వారి పాత్ర ప్రశంసనీయమని కేసీఆర్ ఆ వీడియోలో ప్రస్తావించారు. 

కేటీఆర్​కు సంస్కారం లేదు: మధుయాష్కీ

దేశానికి సేవలందించిన రాజీవ్​గాంధీ పై కేటీఆర్  చిల్లర మాటలు మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమని మాజీ ఎంపీ మధు యాష్కీ ఒక ప్రకటనలో మండిపడ్డారు. దేశానికి ప్రధానిగా సేవలందించిన నేతల విగ్రహాలను ఎక్కడైనా పెట్టుకొని, గౌరవించుకోవచ్చని చెప్పారు. ఆ సోయి, సంస్కారం కేటీఆర్ కు లేదని ఫైర్ అయ్యారు.

అధికారం పోయినా కేటీఆర్ లో అహంకారం తగ్గలేదని ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నేత గురించి మాట్లాడే నైతికత కేటీఆర్ కు ఎక్కడిదని ప్రశ్నించారు. సెక్రటేరియెట్​లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే దమ్ము కేటీఆర్ కు ఉందా? అని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు.