అనర్హులకు దళిత బంధు ఇచ్చారంటూ కాంగ్రెస్ ధర్నా

అనర్హులకు దళిత బంధు ఇచ్చారంటూ కాంగ్రెస్ ధర్నా

మంథని, వెలుగు: దళితబంధు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగలేదని ఆరోపిస్తూ మంథనిలో శుక్రవారం కాంగ్రెస్ ​లీడర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బంధును బీఆర్ఎస్​ లీడర్లకే ఇచ్చారన్నారు. మంథనిలో నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్​కు దళితబంధు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. 

అర్హులకు దళితబంధు ఇవ్వాలని డిమాండ్​చేస్తూ అంబేద్కర్ చౌరస్తా నుంచి మంథని ఆర్డీవో ఆఫీసు వరకు ర్యాలీ తీశారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజు, లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.