ఆదిలాబాద్​ నేతలపై కాంగ్రెస్ క్రమశిక్షణా చర్యలు

ఆదిలాబాద్​ నేతలపై కాంగ్రెస్ క్రమశిక్షణా చర్యలు

హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా నేతలపై కాంగ్రెస్ ​పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నిర్ణయాన్ని కాదని రెబల్​గా పోటీ చేస్తున్న అభ్యర్థి సంజీవ్​ రెడ్డి, ఆయనకు సహకరిస్తున్న ఆదిలాబాద్​ డీసీసీ అధ్యక్షుడు సాజిద్​ ఖాన్​, పీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్​ సుజాత, భార్గవ్​ దేశ్​పాండేలను పార్టీ నుంచి బహిష్కరించింది. ఈమేరకు శుక్రవారం పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్​ జి.చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ​ఇటీవల పార్టీలో చేరిన ఎన్నారై కంది శ్రీనివాస్​ రెడ్డికి ఆదిలాబాద్​ టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన  సంజీవ్​ రెడ్డి.. ఆదిలాబాద్​లో 
రెబల్​గా నామినేషన్​ వేశారు.