నువ్వా..నేనా ? డీసీసీ ప్రెసిడెంట్​ పోస్ట్​ కోసం పోటాపోటీ

నువ్వా..నేనా ?  డీసీసీ ప్రెసిడెంట్​ పోస్ట్​ కోసం పోటాపోటీ
  • ఎవరికి దక్కుతుందోనని జిల్లా నేతల్లో ఉత్కంఠ 
  • కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరాసక్తత
  • రేస్​లో డజన్​కుపైగా లీడర్లు 
  • తెరపైకి బీసీ వాదం 

నిజామాబాద్, వెలుగు : కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవికి నువ్వా..నేనా అన్నట్లుగా పోటీ నడుస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఓడిన నేతలు, టికెట్ దక్కని వారితో సహా ముఖ్య లీడర్లు ఈ పోస్టును ఆశిస్తూ పైరవీలు చేస్తున్నారు. పలువురు లీడర్లు బీసీవాదాన్ని వినిపిస్తుండగా మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ నేతలు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్​ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరిస్తే రాజకీయంగా ఎదగవచ్చని నేతల అంచనా. డీసీసీ ప్రెసిడెంట్​గా ఇప్పటి రెండు దఫాలు పనిచేసిన మానాల మోహన్​రెడ్డి టర్మ్​ ముగియడంతో డీసీసీ పీఠం దక్కించుకోవాలని ఎవరికి వారు పైరవీలు షురూ చేశారు.

పెరుగుతున్న పోటీదారుల లిస్ట్​..

అసెంబ్లీ ఎలక్షన్​లో రూరల్​ టికెట్ ఆశించి భంగపడ్డ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్​ నగేష్​రెడ్డి డీసీసీ  పోస్టు కోసం సీరియస్​గా ప్రయత్నిస్తున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డితో పాటు తన దగ్గరి బంధువైన స్టేట్​ ఫిల్మ్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ చైర్మన్​ దిల్​రాజును ఆశ్రయించారు. జిల్లా పార్టీలో సీనియర్​ లీడరైన బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డిపైనా ఒత్తిడి చేస్తున్నారు. సీఎం రేవంత్​రెడ్డికి సన్నిహితుడైన ఆర్మూర్​ సెగ్మెంట్ ఇన్​చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి డీసీసీ పోస్టుపై ఇంట్రెస్ట్​తో ఉన్నారు. 

అసెంబ్లీ ఎలక్షన్​లో ఓటమిచెందినప్పటికీ యాక్టివ్ పాలిటిక్స్​లో ఉన్నారు.  బాల్కొండ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన ఆరెంజ్​ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్​రెడ్డి యూత్​ కోటాలో పార్టీ అధ్యక్ష పదవిపై ఆసక్తి కనబరుస్తున్నారు. స్టేట్ సీడ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్​ అన్వేష్​రెడ్డి, మార్క్​ఫెడ్​ చైర్మన్ మార గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్​ మార చంద్రమోహన్​ కూడా రేస్​లో కొనసాగుతున్నారు. 

నేను సైతం అంటున్న ఈరవత్రి, మరికొందరు..

రాష్ట్రంలో బీసీ గణన తరువాత బీసీ నినాదం బలం పుంజుకుంది. ఈ వర్గం నుంచి మాజీ విప్, స్టేట్ మినరల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్​ ఈరవత్రి అనీల్​ డీసీసీ పోస్టు కోసం హైకమాండ్​ను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎలక్షన్​లో ఆర్మూర్​ టికెట్ ఆశించిన బీసీ నేత ఏబీ శ్రీనివాస్​ (చిన్నా), నుడా చైర్మన్​ కేశ వేణు, మాజీ జడ్పీటీసీలు కంచెట్టి గంగాధర్, అమృతాపూర్​ గంగాధర్, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి సన్నిహితుడు శేఖర్​గౌడ్ డీసీసీ పోస్టుపై  ఆశలు పెట్టుకున్నారు. మరో బీసీ నేత నరాల రత్నాకర్ ఢిల్లీ లెవల్​లో పరిచయాలను ఉపయోగించుకుంటున్నారు.

 ఉర్దూ అకాడమీ చైర్మన్​ తాహెర్​మైనార్టీ వర్గం నుంచి డీసీసీ పోస్ట్​కు సై అంటున్నారు. పార్టీ ప్రచార కమిటీ మెంబర్ జావెద్​ అక్రమ్ యూత్​ కోటాలో ఈ పదవిని కోరుతున్నారు. ఎస్టీ వర్గం నుంచి మాజీ ఎంపీపీ యాదగిరి, మాజీ జడ్పీటీసీ మోహన్ నాయక్​ పేర్లు  పరిశీలనలో ఉన్నట్లు లీక్​లు వస్తున్నాయి. ఎస్సీ సామాజికవర్గం నుంచి మాజీ డీసీసీ ప్రెసిడెంట్ గడుగు గంగాధర్ మరోసారి ఆ బాధ్యతలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. 

ఎమ్మెల్యేలు 'నో'

రాష్ట్రంలో డీసీసీ ప్రెసిడెంట్లుగా అక్కడి ఎమ్మెల్యేలను  నియమిస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్​ మహేష్​కుమార్ గౌడ్​ ప్రకటించారు. ఆయన ప్రతిపాదనపై జిల్లాలోని ఇద్దరు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు సుదర్శన్​రెడ్డి, భూపతిరెడ్డి ఆసక్తి చూపడం లేదు. క్యాడర్​ను సమన్వయం చేసుకునే సమర్థులను గుర్తించి అపాయింట్ చేయాలని టీపీసీసీకి సూచించారు. మూడేండ్ల  డీసీసీ పోస్టును మానాల మోహన్​రెడ్డి ఇప్పటికీ రెండు దఫాలు నిర్వహించారు.

 ఫిబ్రవరిలో ముగిసిన టర్మ్​ను మూడోసారి రిన్యూవల్ చేసుకోవడానికి ఆయన ఇంట్రెస్ట్​గా లేరు. ఈ విషయాన్ని టీపీసీసీకి కూడా తెలిపారు. స్టేట్​ కోఆపరేటివ్​ డెవలప్​మెంట్ కార్పొరేషన్​ లిమిటెడ్​కు చైర్మన్​గా నామినేటెడ్​ పదవిలో కొనసాగుతున్న ఆయన ఎక్కువ శాతం హైదరాబాద్​లోనే ఉంటూ వీలుదొరికినప్పుడు బాల్కొండ సెగ్మెంట్​కు సమయం కేటాయిస్తున్నారు.