పేదలకు సన్నబియ్యం అందించడమే లక్ష్యం

పేదలకు సన్నబియ్యం అందించడమే లక్ష్యం

భూపాలపల్లి రూరల్/ రేగొండ/ శాయంపేట/ నర్సంపేట, వెలుగు: ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీ రేషన్​ షాప్​లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐతా ప్రకాశ్ రెడ్డితో కలిసి సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు.  కాగా, ఎమ్మెల్యే గండ్ర రేగొండ, శాయంపేట మండల కేంద్రాల్లో సన్నబియ్యం పంపిణీ చేశారు. వరంగల్​ జిల్లా నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలెక్టర్​ సత్యశారదతో కలిసి సన్నబియ్యం పంపిణీ చేశారు.