- ఉదయం 10 గంటలకు కేబినెట్ భేటీ.. 2 రిపోర్ట్లకు ఆమోదం
- 11 గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ
- దేశమంతా కుల గణన చేపట్టాలని తీర్మానం!
హైదరాబాద్, వెలుగు: సమగ్ర కుల గణన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. తర్వాత దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని తీర్మానం చేసి, కేంద్రానికి పంపనున్నది. ఎస్సీ వర్గీకరణపై కూడా ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రకటించనున్నది. అంతకంటే ముందు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా కుల గణన రిపోర్ట్, ఎస్సీ వర్గీకరణ రికమండేషన్స్రిపోర్ట్స్పై చర్చించి.. ఆమోదం తెలుపుతారు.
11 గంటలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం మొదలవుతుంది. ఇందులో సమగ్ర కులగణ న చేపట్టిన విధానం, సేకరించిన వివరాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారు. అనంత రం సభలో కులగణన పూర్తి నివేదికను ప్రవే శపెట్టి, చర్చించే అవకాశం ఉంటుంది. తెలంగాణలో చేపట్టిన కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి, ఈ తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికిపంపుతారు.
నాలుగైదు రోజుల తర్వాత డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్
కులగణన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో రిలీజ్చేసిన తర్వాత దానికి సంబంధించిన అన్ని వివరాలను బీసీ డెడికేటెడ్ కమిషన్ తీసుకోనున్నది. ఇప్పటికే వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంతోపాటు కులగణన వివరాలను తీసుకొని, ఫైనల్ సిఫార్సులు చేసే అవకాశం ఉంది. ఇందుకు కనీసం నాలుగైదు రోజులు సమయం తీసుకుంటారని కమిషన్ వర్గాలు తెలిపాయి. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు డెడికేటెడ్ కమిషన్ కొత్త రిజర్వేషన్లను రికమండ్ చేయనుంది.