జమిలి ఎన్నికలు బీజేపీ రాజకీయ కుట్ర: అద్దంకి దయాకర్

జమిలి ఎన్నికలు బీజేపీ రాజకీయ కుట్ర: అద్దంకి దయాకర్

హైదరాబాద్: జమిలి ఎన్నికలు అనేది ఒక రాజకీయ కుట్ర అని, బీజేపీ తన రాజకీయ మనుగడ కోసమే ఈ అంశాన్ని తెర మీదికి తీసుకొని వస్తుందని కాంగ్రెస్​నేత అద్దంకి దయాకర్ అన్నారు. జమిలి కంటే ముందు జన, కుల గణన, డీలిమిటేషన్ చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను, ప్రతిపక్ష పార్టీలను, వాటి ప్రభుత్వాలను అణిచివేసేందుకే ఒకే దేశం.. ఒకే ఎన్నికల ప్రతిపాదనను బీజేపీ చేస్తుందన్నారు. జమిలి ఎన్నికలు బీజేపీ, ఆరెస్సెస్ రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. రాజకీయంగా నాల్గోసారి ఏ విధంగా అధికారంలోకి రావాలి.. ప్రతిపక్షాలను ఏ విధంగా అణిచివేయాలన్న కోణంలో బీజేపీ జమిలి ఎన్నికలను తీసుకోస్తుందని ఆరోపించారు.