
షాద్ నగర్ , వెలుగు: ఇన్నాళ్లు అరాచక పాలన కొనసాగిన షాద్నగర్ వాసులకు నేడు స్వేచ్ఛ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. షాద్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ గెలవడంతో ప్రతాప్ రెడ్డి పావురం ఎగురవేసి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.