బీఆర్ఎస్ నేతలపై మానవతా రాయ్ ఫిర్యాదు

బీఆర్ఎస్ నేతలపై  మానవతా రాయ్ ఫిర్యాదు

ఓయూ, వెలుగు: బీఆర్ఎస్వీ నాయకులు విచక్షణ కోల్పోయి ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిని దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్​నేత మానవతారాయ్ అన్నారు. సీఎం ఫొటోను కుక్కకు తగిలించిన బీఆర్ఎస్వీ నాయకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ ఎన్ఎస్ యూఐ నేతలతో కలిసి శుక్రవారం ఓయూ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్​రెడ్డి 55 లక్షల మందికి  రైతు రుణమాఫీ చేశారని.. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి సకాలంలో ఫలితాలు వెల్లడించారని అన్నారు. అలాంటి వ్యక్తిపై కనీస అవగాహన లేకుండా మాట్లాడితే సహించేది లేదన్నారు.