సీఎం రేవంత్​ను విమర్శించే అర్హత మందకృష్ణకు లేదు

సీఎం రేవంత్​ను విమర్శించే అర్హత మందకృష్ణకు లేదు
  • కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం ఫైర్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు మంద కృష్ణ మాదిగకు లేదని ఆ పార్టీ సీనియర్ నేత గజ్జెల కాంతం ఫైర్ అయ్యారు. శుక్రవారం గాంధీభవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీకి 2017 నుంచి మద్దతు ఇస్తున్న మందకృష్ణ లాంటి వ్యక్తి రేవంత్​ను ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. వర్గీకరణపై రేవంత్ కమిటీ వేశారని, చైర్మన్​గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారని, ఆయన నాయకత్వంలో వర్గీకరణ జరుగుతుందని తెలిపారు. దీనిపై మరో జ్యుడీషియల్ కమిటీ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణలో వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.