- బీజేపీపై కాంగ్రెస్ నేత జగ్గా రెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు : త్యాగాల చరిత్ర ఉన్న నెహ్రు, గాంధీ కుటుంబాల గురించి పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అబద్ధాలు మాట్లాడారని, ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నానని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాసిసిచ్చిన అబద్ధపు మాటలను రాష్ట్రపతి చదివి వినిపించారని ఆయన విమర్శించారు.
విలువలు లేని రాజకీయాలు చేయడం బీజేపీ నేతలకు అలవాటే అని మండిపడ్డారు. దేశ ప్రజల కోసం జైలుకు వెళ్లిన చరిత్ర, ప్రాణత్యాగం చేసిన చరిత్ర నెహ్రు, ఇందిరా గాంధీదే అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడైనా జైలుకు వెళ్లారా అని జగ్గా రెడ్డి ప్రశ్నించారు.