వరద బాధితులకు పునరావాస ప్యాకేజీని ప్రకటించండి : రాహుల్ గాంధీ

వరద బాధితులకు పునరావాస ప్యాకేజీని ప్రకటించండి : రాహుల్ గాంధీ
  • ఎక్స్’ వేదికగా కేంద్రానికి రాహుల్ గాంధీ డిమాండ్ 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ఆ పార్టీ అగ్రనేత, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ విపత్తుతో నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం త్వరగా పునరావాస ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ, ఏపీలోని వరద పరిస్థితులపై ‘ఎక్స్’ వేదికగా రాహుల్ విచారం వ్యక్తం చేశారు. ‘‘బాధితుల క్షేమం కోసం నేను ప్రార్థిస్తున్నాను.

ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కాంగ్రెస్ సర్కారు అండగా ఉంటుంది. సహాయ, పునరావాస కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలుపంచుకోవాలి. బాధితులను ఆదుకోవడానికి కేంద్రం వెంటనే పునరావాస ప్యాకేజీని ప్రకటించాలి” అని తెలిపారు.