
న్యూఢిల్లీ: రూ. 10 వేల కోట్ల విలువైన ఎంప్లాయిమెంట్లింక్డ్ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) స్కీమ్ ఎక్కడపోయిందని కేంద్ర సర్కారును కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ప్రశ్నించారు. ఏడాది గడుస్తున్నా ఈ పథకం జాడలేదని, యువతకు ఉద్యోగాలివ్వలేదని పేర్కొన్నారు. ఈ స్కీమ్ మోదీ మరో జుమ్లా(అబద్ధం) అని ఎద్దేవా చేశారు.
శుక్రవారం రాహుల్గాంధీ ‘ఎక్స్’ వేదికగా ఈఎల్ఐ స్కీమ్పై కేంద్ర సర్కారును నిలదీశారు. ప్రధాని మోదీ ఏడాది కింద ఆర్భాటంగా ప్రకటించిన ఈఎల్ఐ స్కీమ్కు అసలు నిర్వచనమే ఇవ్వలేదని ఆరోపించారు. మోదీ రోజుకో కొత్త స్లోగన్ను సృష్టిస్తున్నారని, కానీ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని అన్నారు. దీంతో యువత ఉపాధిపై కేంద్ర సర్కారుకు ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థమవుతున్నదని అన్నారు.
వ్యాపారవేత్తల సంపద పెంపుపైనే దృష్టి
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంకంటే.. వ్యాపారవేత్తల సంపద పెంపుపైనే మోదీ సర్కారు దృష్టిపెట్టిందని రాహుల్గాంధీ విమర్శించారు. పెద్ద కార్పొరేట్ కంపెనీలపై మాత్రమే దృష్టి పెట్టడం, సమానత్వం లేని వ్యాపారాలను ప్రోత్సహించడం, ప్రొడక్షన్కు బదులు అసెంబుల్డ్పై ఆధారపడడం, స్వదేశీ నైపుణ్యాలను పట్టించుకోకపోవడం వల్ల ఉపాధి సృష్టి సాధ్యం కావడంలేదని అన్నారు.
అదానీ, ఇతర సంపన్న స్నేహితుల ఆస్తులను పెంచడంపైనుంచి దృష్టిని అట్టడుగు వర్గాల యువతకు సమాన ఉపాధి అవకాశాలు కల్పించడం వైపు ఎప్పుడు మళ్లిస్తారని మోదీని అడిగారు. కాగా, రాహుల్గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాహుల్గాంధీ తన అజ్ఞానాన్నే ఆయుధంగా మలుచుకుంటున్నారని విమర్శించింది. 2004–14 మధ్య కాంగ్రెస్నేతృత్వంలోని యూపీఏ సర్కారు కేవలం 2.9 కోట్ల ఉద్యోగాలు మాత్రమే సృష్టిస్తే.. 2014–24 మధ్య మోదీ సర్కారు 17.19 కోట్ల ఉద్యోగాలు కల్పించిందని బీజేపీ నేత అమిత్ మాలవీయ పేర్కొన్నారు.