
సత్తుపల్లి, వెలుగు : బీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఓటర్లను కులమతాలుగా విడగొట్టి ప్రలోభాలకు గురి చేసే కుట్ర చేస్తోందని, దీనిని ప్రజలు తిప్పికొట్టాలని కాంగ్రెస్ నేతలు డాక్టర్ మట్టా రాగమయి, దాయనంద్ పిలుపునిచ్చారు. శనివారం ద్వారకాపూరి కాలనీలో గడపగడపకు కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.