
హుస్నాబాద్, వెలుగు : రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్రావుపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ విమర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యతారహితంగా ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన వీడియోలో మాట్లాడిన క్లిప్పింగ్ను విలేకరులకు పంపించారు.
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్రావుకు సోదరులు లేకున్నా, ఆయన అన్న కూతురుకు జెన్కోలో అక్రమంగా ఉద్యోగాన్ని ఇప్పించుకున్నారని ఆరోపణలు చేస్తున్నారన్నారు. దీనిని వినోద్రావు ఖండించినా మంత్రి పొన్నం ప్రభాకర్ అదే అంశాన్ని మీడియా సమావేశంలో లేవనెత్తారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆయన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.