షబ్బీర్​అలీని సన్మానించిన కాంగ్రెస్​ లీడర్లు

షబ్బీర్​అలీని సన్మానించిన కాంగ్రెస్​ లీడర్లు

కామారెడ్డి, వెలుగు: ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన మాజీ మంత్రి షబ్బీర్​అలీని సోమవారం కామారెడ్డికి చెందిన కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలు సన్మానించారు. హైదరాబాద్​లోని షబ్బీర్​అలీ ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్ ​శ్రీనివాస్​రావు, లీగల్​సెల్​ జిల్లా చైర్మన్​ దేవరాజు గౌడ్, టౌన్ ​ప్రెసిడెంట్​ పండ్ల రాజు, లీడర్లు గోనె శ్రీనివాస్, కారంగుల అశోక్​రెడ్డి, పంపరి లక్ష్మణ్, శ్రీనివాస్, శ్యాంగౌడ్,  పంతులు శీను, శ్రీధర్​రావుపాల్గొన్నారు.

భిక్కనూరు: ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులైన మాజీ మంత్రి షబ్బీర్​అలీని భిక్కనూరు మండల కాంగ్రెస్​ లీడర్లు సోమవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్​రెడ్డి, ఎంపీపీ గాల్​రెడ్డి, మండలాధ్యక్షుడు భీమ్​రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్​రెడ్డి, కుంట లింగారెడ్డి, మాజీ ఎంపీపీ బాల్యల రేఖ, సుదర్శన్​ పాల్గొన్నారు.