![సీఎం, మంత్రుల ఫోటోలకు క్షీరాభిషేకం](https://static.v6velugu.com/uploads/2025/02/congress-leaders-perform-milk-anointing-ceremony-for-cm-revanth-reddy-and-ministers_PdXrFyODz8.jpg)
కోరుట్ల, వెలుగు: కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో కోరుట్లలో గురువారం సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల ఫొటోలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కులగణన విజయవంతగా పూర్తిచేసి ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వానికి, హామీ నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
బీసీ కులగణన చారిత్రాతకమైన నిర్ణయమన్నారు. కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకటేశ్ గౌడ్, కాంగ్రెస్పట్టణ, మండల, బ్లాక్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, కొంతరాజం, సత్యనారాయణ, లింబాద్రి, సురేశ్, శంకర్ గౌడ్, ప్రభాకర్, నాగభూషణం, భూమారెడ్డి పాల్గొన్నారు.