కేసీఆర్ ​క్యాంపు ఆఫీస్ను ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు

కేసీఆర్ ​క్యాంపు ఆఫీస్ను ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు

గజ్వేల్: మాజీ సీఎం, గజ్వేల్​ఎమ్మెల్యే కేసీఆర్​ క్యాంపు ఆఫీస్ను ఇవాళ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. ఈ మేరకు ఆఫీస్ లో కేసీఆర్​ చిత్రపటానికి వినతి పత్రం అందించి నిరసనకు దిగారు. కేసీఆర్​ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ సక్రమంగా జరగడం లేదని విమర్శించారు. గెలిచిన నాటి నుంచి ఇప్పటికీ ఒక్కసారి కూడా గజ్వేల్​కు రాలేదన్నారు. నియోజకవర్గంలో పెండింగ్​ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ.. క్యాంపు ఆఫీస్​ గోడకు వినతి పత్రాన్ని అతికించారు. కేసీఆర్ ​ఫామ్ హౌస్ ​విడిచి బయటకు రావాలని డిమాండ్​ చేశారు.

ALSO READ | రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలె: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్​రెడ్డి