బాధిత కుటుంబానికి కాంగ్రెస్​ లీడర్ల ఆర్థికసాయం

బాధిత కుటుంబానికి కాంగ్రెస్​ లీడర్ల ఆర్థికసాయం

కోల్​బెల్ట్​, వెలుగు:​ రామకృష్ణాపూర్​ పట్టణంలోని కనకదుర్గా కాలనీకి చెందిన బర్ల లలితమ్మ బాధిత కుటుంబానికి కాంగ్రెస్​ లీడర్లు సోమవారం ఆర్థికసాయం చేశారు. ఇటీవల లలితమ్మ కుమారుడు హర్షవర్ధన్​ అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదేశాలతో క్యాతనపల్లి కాంగ్రెస్​ పార్టీ టౌన్​ ప్రెసిడెంట్​ పల్లె రాజు, రెండో వార్డు కౌన్సిలర్​ పుల్లూరి సుధాకర్​ ఆధ్వర్యంలో స్థానిక లీడర్లు బాధిత కుటుంబం ఖర్చుల నిమిత్తం సాయమందించారు. 

కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్​, నీలం శ్రీనివాస్​గౌడ్​, గోపు రాజం, బుడిగ శ్రీనివాస్​, నల్లూరి రాజు, బొడ్డు వెంకటేశ్​, రాజేశ్​, కుర్మ సురేందర్​ తదితరులు పాల్గొన్నారు.