
హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో మైనారిటీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ.. సోమవారం నాంపల్లిలోని గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఆందోళన చేశారు. మైనార్టీలకు ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు వారికి తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మైనార్టీల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు.. గాంధీ భవన్ కు చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ భవిష్యత్లో ఖాళీ కానున్న ఎమ్మెల్సీపై తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని మైనార్టీ నేతలు పట్టుబట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.