రక్తంతో కన్నీళ్లు పెడతారు: పోలీసులకు ఎమ్మెల్యే వార్నింగ్

రక్తంతో కన్నీళ్లు పెడతారు: పోలీసులకు ఎమ్మెల్యే వార్నింగ్

జైపూర్: రాజస్థాన్ మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ చందనా పోలీసులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని కోటాలో రైతుల ట్రాక్టర్ ర్యాలీలో పొల్గొన్న అశోక్ చందనా మాట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలోనే బీజేపీ ప్రభుత్వం మారుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టకూడదు. బీజేపీ నాయకుల కోరిక మేరకు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే.. మీరు రక్తంతో కన్నీళ్లు పెట్టాల్సి వస్తోందని పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.కాంగ్రెస్ కార్యకర్తలను వేధించవద్దని హెచ్చరించడానికి పోలీసు సిబ్బందిని ఉద్దేశించి అశోక్ చందనా చేసిన వ్యాఖ్యలు రాజస్థాన్ పాలిటిక్స్‎లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అశోక్ చందనా వ్యాఖ్యలపై అధికార బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అశోక్ చందనాకు వివాదాలు కొత్తమే కాదని విమర్శించింది. 

Also Read : గుడ్ న్యూస్..రైతుల అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు