
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రం వచ్చి పదేండ్లయితున్నా ఇంకా తెలంగాణ సెంటిమెంట్ను వాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. చెప్పుకోవడానికి ఏమీ లేకనే తెలంగాణ వాదాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్తొమ్మిది కిస్తీల ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్పార్టీలో సీఎం అభ్యర్థి విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, సోనియా, రాహుల్, ఖర్గే అందరి అభిప్రాయాలు తీసుకుని సీఎం క్యాండిడేట్ను డిసైడ్ చేస్తారని స్పష్టం చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్లో బీఫామ్ తీసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్పార్టీకి 70 సీట్లు పక్కా వస్తాయన్నారు.
15వ తేదీ తర్వాత పార్టీ స్పీడును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. తమ మెయిన్టీమ్రాష్ట్రమంతటా యాక్టివ్ అయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని బీఆర్ఎస్కు భయం పట్టుకుందని విమర్శించారు. కర్నాటక ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలను బీఆర్ఎస్ మిస్గైడ్ చేస్తున్నదని, అబద్ధాలు చెప్పి కేసీఆర్బయటపడాలని చూస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ మొత్తం ఒక ఆవారా పార్టీగా మారిందని మండిపడ్డారు. హరీశ్రావుకు నిద్ర తక్కువై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తానని పేర్కొన్నారు. పటిష్టమైన 50 డ్యాములు కట్టిన కాంగ్రెస్ఎక్కడ.. ఒక్క డ్యామ్కే సినిమా చూపిస్తున్న బీఆర్ఎస్ ఎక్కడ అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ వస్తుందనగా ఎన్నెన్నో హామీలు ఇచ్చారని, వాటికి సంబంధించి ఒక్క జీవో కూడా రాలేదని విమర్శించారు.
అమరుల కుటుంబాలకు అన్నం పెట్టారా?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతోమంది ఉద్యమకారులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, వారి కుటుంబ సభ్యులను ప్రగతి భవన్కు పిలిచి ఒక్కపూటైనా అన్నం పెట్టారా అని జగ్గారెడ్డి మండిపడ్డారు. కొందరు అమాయకులను చంపి వాళ్ల చేతుల్లో చిట్టీలు పెట్టినోళ్లు ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారని, చివరకు వారి కుటుంబాలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు యూనివర్సిటీలకు ఎందుకు వెళ్లలేకపోతున్నారని ప్రశ్నించారు. కవిత జైలుకు వెళ్తుందని బండి సంజయ్ రోజూ చెప్పారని, ఆమె అరెస్ట్ ఆగిపోగానే బీజేపీ పని ఖతం అయిందని విమర్శించారు. ఆ విషయంలో సంజయ్ నోరు విప్పినందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారని ఆరోపించారు. ముస్లింలకు ఒవైసీ బ్రదర్స్ ఏం చేశారో చెప్పాలని జగ్గారెడ్డి ప్రశ్నించారు. సీఎం ఎవరుంటే వాళ్లను గొప్ప సీఎం అని పొగడటం తప్ప ఒవైసీలకు ఏమీ రాదని ఎద్దేవా చేశారు.