![సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం బాగుంది. అభినందిస్తున్నా : ఎమ్మెల్యే పోచారం](https://static.v6velugu.com/uploads/2024/06/congress-mla-pocharam-srinivas-reddy-interview-with-v6_cgCExqnye7.jpg)
పరిస్థితుల ప్రభావం వల్లనే పార్టీ మారానని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. తాను పార్టీ మారితే ఎవరూ వ్యతిరేకించలేదని చెప్పారు. స్వార్ధం కోసం పార్టీ మారకూడదని చెప్పిన పోచారం... అలా మారితే భవిష్యత్ ఉండదన్నారు.వీ6కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం బాగుందన్న పోచారం.. . రేవంత్ నిర్ణయాలు ఇంకా బాగున్నాయని చెప్పారు. ఆయన అందర్ని కలుపుకోని పోవాలని చెప్పారు. నియోజక సమస్యలకు, తన డిమాండ్లకు సీఎం ఓకే చెప్పారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో చాలా మార్పులు వచ్చాయని చెప్పారు పోచారం. ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడే బాగుండేదన్నారు. స్వార్ధం కోసం ప్రభుత్వాన్ని వాడారని ఆరోపించారు. కేసీఆర్ తనను లక్ష్మీ పుత్రుడని అన్నారని.. రాజీనామా చేశాకే ఆయన్ని కలిశానని తెలిపారు. బీఆర్ఎస్ భవిష్యత్ పై కార్యకర్తల్లో ఆందోళన నెలకొందని చెప్పారు పోచారం.