పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ

పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ

ఉత్తర ప్రదేశ్ లోని  సుల్తాన్ పూర్ కు వెళ్లారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పరువు నష్టం కేసులో సుల్తాన్ పూర్ కోర్టులో స్వయంగా విచారణకు హాజరయ్యారు.  కేంద్రహోంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ  2018లో నమోదైన కేసులో ఇవాళ సుల్తాన్ పూర్ కోర్టులో విచారణ జరిగింది.

ఇప్పటికే ఇదే కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ ఇచ్చింది కోర్టు.  రాహుల్ గాంధీని వేధించేందుకే బీజేపీ అక్రమ కేసులు పెట్టిందన్నారు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్. దేశ ప్రజల హక్కుల కోసం రాహుల్ పోరాడుతున్నారు కాబట్టే.. ఆయనపై కేసులు పెడుతున్నారన్నారు.