న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-2026 ఆర్ధిక సంవత్సర బడ్జెట్పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పి్స్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు సమ న్యాయం చేయలేదని.. కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని ఆరోపిస్తు్న్నారు. ఈ క్రమంలో 2025 బడ్జెట్పై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బడ్జెట్పై రియాక్ట్ అయిన రాహుల్ గాంధీ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘‘బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ చికిత్స’’గా 2025 బడ్జెట్ను ఆయన అభివర్ణించారు.
ALSO READ | రూ.8 లక్షల ఆదాయానికి ఇకపై రూ.30 వేల ట్యాక్స్ కట్టక్కర్లేదు: మంత్రి నిర్మలా సీతారామన్
ఆర్థిక సంక్షోభంపై బడ్జెట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఎన్డీఏ సర్కార్ మరోసారి అన్ని వర్గాలను మోసం చేసిందని బడ్జెట్పై అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని మోడీ సైతం బడ్జెట్పై స్పందించారు. ‘‘ఇది ప్రజల బడ్జెట్. ప్రజల ఆకాంక్షలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుంది. ఈ బడ్జెట్లో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. పొదుపు, పెట్టుబడులకు ఈ బడ్జెట్ బూస్ట్ ఇస్తుంది. ప్రజలను మిగితా ప్రభుత్వాలు దోచుకుంటే.. మేం వారికి డబ్బు ఇస్తున్నాం’’ అని మోడీ పేర్కొన్నారు.
A band-aid for bullet wounds!
— Rahul Gandhi (@RahulGandhi) February 1, 2025
Amid global uncertainty, solving our economic crisis demanded a paradigm shift.
But this government is bankrupt of ideas.