పరువు నష్టం కేసులో.. నేడు కోర్టుకు రాహుల్ గాంధీ

పరువు నష్టం కేసులో.. నేడు కోర్టుకు రాహుల్ గాంధీ

సుల్తాన్‌‌‌‌పూర్(యూపీ):  పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తరప్రదేశ్​ సుల్తాన్ పూర్ లోని ఎంపీ–ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటలకు రాహుల్ లక్నో ఎయిర్​పోర్టు నుంచి సుల్తాన్​పూర్ వెళ్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

2018లో బీజేపీ నేత, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్​షాపై అభ్యంతరకర కామెంట్లు చేశారంటూ సుల్తాన్ పూర్ బీజేపీ నేతలు రాహుల్​పై పరువు నష్టం కేసు పెట్టారు. ఈ కేసులో రాహుల్​కు ఈ ఏడాది ఫిబ్రవరి 20న కోర్టు బెయిల్ ఇచ్చింది. శకుక్రవారం  విచారణ నేపథ్యంలో ఆయన హాజరు కానున్నారు.