అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది.. జమ్మూ కాశ్మీర్ సీఎం ఈయనే..!

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది.. జమ్మూ కాశ్మీర్ సీఎం ఈయనే..!

జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల కౌంటింగ్ పూర్తైంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి గెలుచుకుంది. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, సీపీఎం, జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ లు కలిపి 49 నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. అలయన్స్ లో జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంది. 42 మంది జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) పార్టీ అభ్యర్థులే గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన వారిలో ఆరుగురు విజయం సాధించారు. సీపీఎం కాండిటేట్ ఒకరు గెలిచారు.

29 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) 3 స్థానాలు కైవసం చేసుకుంది. స్వతంత్ర పార్టీ అభ్యర్థులు ఆరుగురు గెలవగా.. మరో ఇద్దరు చెరో పార్టీ నుంచి విజయం సొంతం చేసుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ సీట్లు వచ్చాయి. దీంతో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థికి ఒమర్ అబ్దుల్లా బనేని ప్రకటించారు.

ALSO READ | జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నా: ఇల్తిజా ముఫ్తీ

జమ్మూకాశ్మీర్ 90 నియోజకవర్గాలకు మూడు దశల్లో సెప్టెంబర్ 18, 25 మరియు అక్టోబర్ 1న పోలింగ్ జరిగింది. అక్కడ ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటి సారిగా ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 63.88శాతం ఓటర్లు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని జమ్మూ & కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. భారీ భద్రతా ఏర్పాట్లతో అక్టోబర్ 8 ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.