
ఆర్మూర్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్పార్టీ అభ్యర్థి ఉట్కురి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆర్మూర్లో శుక్రవారం కాంగ్రెస్పార్టీ నాయకులు విస్తృత ప్రచారం చేశారు.
మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ భూక్యాతో కలిసి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి రిటైర్డ్ఎంప్లాయిస్ తో, విజయ్ హైస్కూల్లో వేర్వేరుగా మీటింగ్లు ఏర్పాటు చేసి కాంగ్రెస్పార్టీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. వ్యవసాయ మార్కెట్కమిటీ చైర్మన్సాయిబాబాగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మోత్కురి లింగాగౌడ్, కొంతం మురళీధర్, పండిత్ పవన్తదితరులు పాల్గొన్నారు.