బీఆర్​ఎస్​ లీడర్ల అనుచరులకే దళితబంధు

బీఆర్​ఎస్​ లీడర్ల అనుచరులకే దళితబంధు
  • అర్హులకే ఇవ్వాలని అమీన్​పూర్​లో సీఎం దిష్టిబొమ్మ దహనం 

రామచంద్రాపురం (అమీన్​పూర్​), వెలుగు : సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో సోమవారం అనర్హులకు దళిత బంధు ఇస్తున్నారంటూ కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మకు పాడె కట్టి ఊరేగించి దహనం చేశారు. కాంగ్రెస్​ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో  ఆయన మాట్లాడుతూ మండలంలోని 393 మంది దళిత కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

48 మంది బీఆర్ఎస్ పార్టీ నేతల అనుచరులకు దళిత బంధు ఇచ్చారని ఆరోపించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్​, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధ, టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వడ్డె కృష్ణ, నర్సింగ్ రావు, ఎంపీపీ రవీందర్​ గౌడ్, గంగు రమేశ్​, దేవదానం, హబీబ్​ జానీ, శ్యాంరావు పాల్గొన్నారు.