27 మంది కౌన్సిలర్ల మద్దతుతో.. అవిశ్వాస తీర్మానంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ

27 మంది కౌన్సిలర్ల మద్దతుతో.. అవిశ్వాస తీర్మానంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ

మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవిశ్వాసం తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 26 మంది కౌన్సిలర్స్, బీజేపీకి చెందిన ఒక కౌన్సిలర్ పాల్గొన్నారు. దీంతో 27 మంది కౌన్సిలర్ల మద్దతుతో.. అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ పార్టీకే దక్కాయి.

ఈ నివేదికను స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో రాములు మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ కు అందజేవారు. కాగా అవిశ్వాస తీర్మానంలో తమకు మెజారిటీ లేదని.. తీర్మానానికి ముందే బీఆర్ఎస్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ రాజీనామా చేశారు.