
కొత్తకోట, వెలుగు: మహబూబ్నగర్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని కాంగ్రెస్ పార్టీ వనపర్తి డీసీసీ అధ్యక్షులు రాజేందర్ ప్రసాద్ అన్నారు. పట్టణంలో కాంగ్రెస్పార్టీ డీసీసీ అధ్యక్షులు మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన వెంబడే ఆరు గ్యారెంటీల్లో మిగిలిన హమీలను సీఎం రేవంత్ రెడ్డి నేరవేరుస్తాడన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మేస్ర్తీ శ్రీను, మాజీ జెడ్పీటీసీపిజె బాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల శ్రీనువాస్ రెడ్డి, కృష్ణ రెడ్డి, బోయేజ్, నరేందర్రెడ్డి పాల్గొన్నారు.